తిక్కన తిరుగాడిన నేల

 

తిక్కన తిరుగాడిన నేల

 

తిక్కన (1205 - 1288) మహాభారతములో నన్నయ్య రచించిన పర్వాలు కాకుండా మిగిలిన 15 పర్వాలను రచించాడు. ఆది కవి నన్నయ ఆది పర్వము, సభాపర్వము, అరణ్యపర్వములో కొంతభాగము రచించి గతించిరి. అరణ్యపర్వములో మిగిలిన భాగమును ఎఱ్ఱన రచించాడు. తిక్కన అరణ్యపర్వమును వదలి, మిగిలిన పర్వములు రచించిరి. ముందుగా యజ్ఞము చేసి, సోమయాజియై, పిదప ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టాడు. ఈయనకు "కవి బ్రహ్మ", "ఉభయ కవిమిత్రుడు" అనే బిరుదులు ఉన్నాయి.

క్రీస్తు శకం 1253 సంవత్సరంలో తిక్కన కోవూరు మండల పరిధిలోని పాటూరు గ్రామ సిద్దేశ్వరాలయంలో యజ్ఞం చేసినట్లు చరిత్ర చెబుతోంది. ఆశయసిద్ధి కోసం ఈశ్వరాలయంలో యజ్ఞం చేసినందువల్ల ఆ ఆలయాన్ని సిద్ధేశ్వరాలయంగా పిలిచారు. యజ్ఞం పూర్తి చేసిన తరువాత తిక్కన సోమయాజిగా మారి మహాభారత రచనకు ఉపక్రమించారు. అప్పటి యజ్ఞానికి సంబంధించిన అనేక అవశేషాలు నేడు శిథిలావస్థకు చేరుకొన్నాయి. తిక్కన తిరుగాడిన జాడలేవీ?'వింటే భారతం వినాలి .... తింటే గారెలు తినాలి' అనే నానుడికి జీవం పోసింది తిక్కన. మహాభారత కథనాలకు అంతటి ఖ్యాతిని ఆర్జించిన కవిబ్రహ్మ తిక్కన మెచ్చిన ప్రదేశం, ఆయన పూజించిన ఆలయం నేడు దయనీయ స్థితికి చేరుకొన్నాయి.

మానవుడు పంజరంలోని చిలుకలాంటి వాడు' అనే ఉపమానం, నానుడి తిక్కన చాలా పర్యాయాలు ఉపయోగించారు. నిర్వచనోత్తర రామా యణంలో మొదటి మనుమసిద్ధిని వర్ణిస్తూ "కీర్తి జాలము త్రిలోకీ శారీకకు అభిరామరాజిత పంజరంబుగజేసి అని చెప్పారు. అలాంటి తిక్కనే పూజించి, యజ్ఞం చేసిన సిద్దేశ్వరాలయం, రాతివిగ్రహాలు నేడు నిర్లక్ష్యమనే పంజరంలో చిక్కుకొని శిథిలావస్థలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఆయన పూజలు చేసిన నందీశ్వరుడ్ని అపహరించారు. మహాభారతాన్ని రసరమ్యంగా వర్ణించేందుకు తిక్కనకు సహకరించింది కోవూరు ప్రాంతమే.

తిక్కన పూర్వీకులు 'కొట్టురువు' ఇంటి పేరుతో పాటూరు గ్రామాధిపతులుగా పనిచేసినట్లు చరిత్ర చెబుతోంది. మనుమసిద్ధి కాలంలో తిక్కన ఇంటిపేరు 'పాటూరుగా' మారినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. యజ్ఞయాగాదులు అంటే తిక్కనకు చాలా ఇష్టం. పదకొండు పర్యాయాలు ఆయన పాటూరులోని సిద్ధేశ్వరాలయంలో యజ్ఞం చేసినట్లుగా కేతన తన దశకుమార చరిత్రలో పేర్కొన్నారు. వేప, రావి చెట్లు మొలచి ఆలయం ధ్వంసమవుతోంది. ఆలయ ప్రాంగణాన ఉన్న బావిలో తిక్కన నిత్యం స్నానమాచరించి, సంధ్యావందనం చేసినట్లుగా తెలుస్తోంది. ఆ బావి వర అంతర్భాగంలో చెక్కిన చంద్రుడు, వినాయకుని శిల్పాలు సుందరంగా ఉండేవట కానీ, బావి పూర్తిగా ముళ్లపొదలతో నిండిపోవడం చేత ఆ శిల్పాల్ని ఇప్పుడు చూడలేము. మహాభారత రచనకు తిక్కన ఉపయోగించినట్లుగా చెప్పే 'ఘంటం' పాటూరుకు చెందిన తిక్కన వారసుల వద్ద ఉందని చెబుతారు. 'ఘంటం' ఉంచే ఒరకు ఒక వైపు సరస్వతీ దేవి, వినాయకుని ప్రతిమల్ని చెక్కారని, తాము చాలా సంవత్సరాల క్రిందట దానిని చూశామని పాటూరు గ్రామ వయోవృద్ధులు చెప్పారు.

నెల్లూరుకు చెందిన సాహిత్య సంస్థ 'వర్ధమానసమాజం' కొన్నేళ్ల కిందట నిర్వహించిన 'తిక్కనతిరునాళ్ళ'లో దానిని ప్రదర్శించారు. ఆ తరువాత ఒర చిరునామా లేకుండా పోయింది. తిక్కన రూపాన్ని దశకుమార చరిత్రలో కేతన వర్ణించారు. ఆయన వర్ణన ఆధారంగా 1924 సంవత్సరంలో గుర్రం మల్లయ్య అనే చిత్రకారుడు ఆంధ్రా యూనివర్సిటీ నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో తిక్కన రూపాన్ని చిత్రీకరించారు. ఆ చిత్రపటమే నేడు నెల్లూరు పురమందిరంలోని వర్ధమాన సమాజంలో పూజలందుకుంటోంది. 1986 సంవత్సరంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆలయ పునర్నిర్మాణానికి రెండు లక్షల రూపాయల్ని మంజూరు చేసింది. అయితే - సిద్ధేశ్వరాలయం, తిక్కన పూజించిన శిలలు అన్నీ తమ సొంతమని, ప్రభుత్వానికీ దేవాదాయశాఖకూ సంబంధం లేదని పాటూరు వంశస్థుడు ఒకాయన ఆలయ పునర్నిర్మాణాన్ని అడ్డుకొన్నారట. పదేళ్ల కిం దట మాత్రం ఒక భక్తుడు శిథిల ఆలయానికి వెల్ల వేయించి తన భక్తిని చాటుకొన్నారని చెబుతారు.

పాటూరు గ్రామంలో తిక్కన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనే ఆలోచన ప్రభుత్వానికి ఇప్పటికీ లేకపోవడం విచారకరమని గ్రామస్థులు అన్నారు. తిక్కన గురించి రాసిన వ్యాసాలు, గ్రంథాలతో ఒక గ్రం«థాలయం ఏర్పాటు చేయాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు. హైదరాబాదులోని టాంకుబండ్‌పై తిక్కన విగ్రహాన్ని ప్రతిష్ఠించిన రాష్ట్ర ప్రభుత్వం ఆయన నివసించిన పాటూరు గ్రామాన్ని మరచిపోవడం బాధాకరం. ఆయన పూజించి, యజ్ఞం చేసిన సిద్ధేశ్వరాలయాన్ని ప్రభుత్వం దర్శనీయ స్థలాల జాబితాలో చేర్చాలని జిల్లా వాసులు, సాహిత్యాభిలాషులు కోరుతున్నారు. బ్రిటిషువారు నిర్మించిన కట్టడాల్ని సైతం చారిత్రక కట్టడాలుగా ప్రాధాన్యత కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం తిక్కన తిరుగాడిన నేల స్మృతులు ... శిల్పాల్ని, ఘంటాన్ని, ఒరను, నందీశ్వరుడ్ని పదిలపరచకపోవడం విచారకరం. తెలుగు జాతి గుండెల్లో తీయ తేనియ నుడుల్ని ఆచంద్రార్కం నిల్పిన తిక్కన జ్ఞాపకార్థం ఈ పని చేయాల్సిన అవసరం ఉంది. 

మహాకవి తిక్కన రుద్రాక్షమాల లభ్యం

 

మహాకవి తిక్కన రుద్రాక్షమాల లభ్యం

 

మహాకవి తిక్కన 12వ శతాబ్దంలో ఉపయోగించిన రుద్రాక్షమాల బయటపడింది. నెల్లూరులో నివసిస్తున్న ఆయన వంశస్థురాలు లక్ష్మీప్రసన్నకు ఆ మాల వంశపారంపర్యంగా సంక్రమించింది. నెల్లూరులోని పెన్నానది ఒడ్డున తిక్కన పార్కులో రుద్రాక్షమాల, పగడాన్ని . మహాభారతములో నన్నయ్య రచించిన పర్వాలు కాకుండా మిగిలిన 15 పర్వాలను తిక్కన రచించాడు. ఆదికవి నన్నయ ఆది పర్వము, సభాపర్వము, అరణ్యపర్వములో కొంతభాగము రచించి గతించెను. అరణ్యపర్వములో మిగిలిన భాగమును ఎఱ్ఱన రచించాడు. అరణ్యపర్వము వరకును నన్నయ వ్రాసి మరణించగా, తరువాత ఈ మహాకవి, తిక్కన అరణ్యపర్వశేషమును మాత్రము విడిచిపెట్టి, విరాటపర్వము మొదలుకొని 15 పర్వములను వ్రాసాడు.అరణ్యపర్వమును ఆంధ్రీకరించుటచేతనే నన్నయ మృతిచెందాడని, అందుకే నేనుకూడా మృతిచెందుతాననే భయంతో అరణ్యపర్వమును తిక్కన విడిచిపెట్టినాడు అని కొందరు అంటారు. గ్రంథరచనకు పూర్వము మనుమసిద్ది తిక్కనచే యజ్ఞము చేయించి భారతమును సంపూర్ణముగా తిక్కనచే రచింపజేసినట్లు చెప్పుదురు. కాని ఈ మనుమసిద్దిరాజు తనని రాజరాజ నరేంద్రుని ఆస్థానమునకి పొమ్మనగా తిక్కన పోనని మారాం చేయడంతో, ఈ విషయాన్ని ఎరిగిన రాజరాజనరేంద్రుడు తిక్కనకి నీవు ఎక్కడనుండైనా రచనచేయవచ్చని సమాచారం పంపగా, అప్పుడు తిక్కనచే మనుమసిద్ది నెల్లూరులో యజ్ఞము చేయించెను. అయిననూ తిక్కన మనుమసిద్ధిపై కోపంతో, భారతముని మనుమసిద్దికి అంకితం ఇవ్వక, హరిహరనాథునికి అంకితం చేసెను అని కొందరి వాదన.

తిక్కన మొదట రచించిన పర్వములను చూసి వానియందు విశేషవృత్తములు లేకపోగా పండితులు, అతడు సామాన్య వృత్తములుతో కాలము గడుపుతున్నాడే కాని అపూర్వవృత్తరచనా కుశలుడు కాడని ఆక్షేపించిన మీదట తిక్కన స్త్రీ పర్వమునందు బహువిధ వృత్తములను రచించాడని చెప్పుదురు. తిక్కన రచించిన 15 పర్వములలో 45 ఆశ్వాసముల కంటే ఎక్కువ గ్రంథము లేదు. ఒక్కొక్క ఆశ్వాసమునకు 445 పద్యములు చొప్పున లెక్క చూసిననూ, భారతంలో తిక్కన 25000 పద్యముల కంటే అధికముండవు. దినమునకు 10 పద్యములు చొప్పున రచించినచో ఇంత మహాభారత గ్రంథము 5 లేదా 6 సంవత్సరములలో రచించవచ్చును. కాబట్టి ఇట్టి గ్రంథము ఒకరివల్ల రచించడం అసాధ్యము కాదు. సాధ్యమయ్యే అవకాశం ఉంది. కాని తిక్కన శైలితో సమానముగా వ్రాయుట మాత్రము ఎవ్వరికి సాధ్యముకాదు. తెలుగుభాష యందు ఎన్నిగ్రంథములు ఉన్నానూ, తిక్కన కవిత్వముతో సమానముగా కాని దానిని మించియున్నట్లుగాని కవిత్వము చెప్పగలిగిన వారు నేటివరకు ఒక్కరును కనబడలేదు. తిక్కన కవిత్వము ద్రాక్షాపాకము మిక్కిలి రసవంతముగా ఉండును. ఇతని కవిత్వమునందు పాదపూరణము కొరకు వాడిన వ్యర్థపదములు అంతగా కనిపించవు. ఈయన కవిత్వము లోలోక్తులతో కూడి జాతీయముగా ఉండును. ఇతని కవిత్వములో ఒకవంతు సంస్కృతము, రెండువంతుల తెలుగుపదములు కనిపిస్తాయి. నన్నయవలె తన గ్రంథమును మూలమునకు సరిగా వ్రాయలేదు. విరాటపర్వమునందు కథ కొంత పెంచెను. తక్కిన పర్వములందు మిక్కిలిగా కథను సంగ్రహపరిచెను. ఉద్యోగపర్వములోని సనత్కుమార ఉపదేశమును మూలమున పదిపండ్రిపత్రములున్నా, తెలుగున 2లేదా 3పద్యములతో సరిపెట్టెను. భగవద్గీతలు, ఉత్తరగీతలు మొదలైనవానిని వ్రాయనేలేదు.

భగవద్గీతలోని కొన్నిశ్లోకములకు దగ్గరగా కొన్ని పద్యములను వ్రాసాడు. ఉదాహరణకు ఈ క్రింది శ్లోకమును చూడుము.

భగవద్గీత శ్లోకము ;;

ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సువః!............... .........మామ కాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయః!!

పద్యము ;;

క;;మ్మానుగ ధర్మక్షేత్రం

బైన కురుక్షేత్రమున మహాహవ మునకున్

బూని మనబలమున్ బాండవ

సేనయు నిటు సన్నీ యేమి చేసెంజె పుమా!

అని తిక్కన ఆంధ్రీకరించాడు.భాగవద్గీతను అనువదించకపోవడానికి కారణం ఏమిటంటే యుద్ధమునందు శత్రువులు ఉన్నప్పుడు 18అధ్యాయములను కృష్ణుడు అర్జునకు చెప్పడం అసాధ్యము అగును.కావున రాయలేదు అని చెప్పవచ్చును.

ఈయన సంస్కృతమును తెనిగించినరీతిని తెలుపుటకై మూలగ్రంథములోని కొన్ని శ్లోకములను వాని అర్థమును తెలుపు పద్యములును కొన్నింటిని వివరించడం చూడవచ్చును.

విరాటపర్వం శ్లోకము

 ఆలో కయసి కిం వృక్షం సూద దారుక్రుతేనవై !

 యది తే దారుభిః కృత్యం బహిర్వ్రుక్షాన్ని గృహ్యతామ్ !!

అనువాద పద్యము వలలుం డేక్కడన్ జూచె ?నొండెడ నపెవ్యక్ష్మాజముల్ పుట్టవే?

 ఫలితంబై వరశాఖ లోప్పన్ గ ననల్పప్రీతి సంధించుచున్

 విలసచ్చాయ నుపాశ్రిత ప్రతతికి న్విశ్రాంతిన్ గావింపన్ గాన్

 గల యీ భుజము వంట కట్టయలకై ఖండింపన్ గా నేటికిన్ ?

 

వేయిపడగలు

 

వేయిపడగలు

వేయిపడగలు నవలను విశ్వనాథ సత్యనారాయణ రచించారు. ఇది విశ్వనాధ నవలలలో అత్యంత ప్రసిద్దమైన నవలగా ప్రజాదరణ పొంది పలుమార్లు పునర్ముద్రితమైనది. 

శైలి, ఉదాహరణలు

పాఠకుల స్థాయి రచయిత దిగిపోవడం కంటే కొంత వరకైనా పాఠకులను ఉన్నత స్థితికి లాగాలని విశ్వనాధ తాపత్రయం


ఈ నవలలో ప్రౌఢమైన భాష, శైలి కనిపిస్తుంది.

క్రింది వాక్యాలు బహుశా సాక్షి వ్యాసాల గురించి కావచ్చును.

    రాసినాయన ఆంధ్రా డికెన్స్ అట. నిజమే కాబోలునని తీసితిని. ఆంగ్లేయములో పిక్‌విక్ పేపర్స్ అని యున్నవి. అవి చాలా రమ్యముగా ఉండును. ఈ యుపన్యాసములు వానిననుసరించి రాయబడెనని చెప్పిరి. తీసి చూచితిని కదా… దానికి దీనికి ఏమియూ సంబంధం లేదు. చెప్పినదే చెప్పి, చెప్పినదేచెప్పి ప్రాణములు తీయుచున్నాడు. పలుకుబడిలో నొదుగు ఒక చిన్న వాక్యమును చెప్పి పెద్ద అర్థమును స్ఫురింపజేయుట మొదలైన మహారచయిత లక్షణములు లేవు. ఒక శయ్య లేదు. వాచ్యత ఎక్కువగా ఉన్నది. శబ్దప్రయోగమునందు కూడా సొగసు కనిపించుటలేదు. (ధర్మారావు అరుంధతి తో)

పాశ్చాత్య భారతీయ రచనా శిల్పాల పోలిక:

    పాశ్చాత్యుల శిల్పము సహారా ఎడారి లోని సికతామయోన్మత్త ప్రళయవాయువుల వలె విరుచుకుని, మానుష ప్రకృతినున్మూలించునకు ప్రయత్నించును. భారతీయ శిల్పము భారత జాతిమతధర్మముల వలెనే ఇంద్రియముల నదుపులో పెట్టి సంఘమర్యాదల ననుసరించి నడువవలెనన్నట్లు - భావోద్రేకమలినం నిర్మూలించి తదంతర్గాఢదృఢత్వమును ప్రకటించును.

మరోచోట "శిల్పం" పై:

    శిల్పం నిప్పులు తొక్కిన కోత వంటిది కాదు. మదించిన ఏనుగు వంటిది. ఉన్మాదమెక్కువ కలది. ఠీవి ఎక్కువ. నిదానమెక్కువ. శక్తి ఎక్కువ.

మరొక "ఆశ్చర్యం కలిగంచే" వ్యాఖ్య -

    భోగముదానికిచ్చిన డబ్బు మోటారు కొన్నదానికన్నా చెడిపోయిందా? ఇది ఏదో ఒక పేదజీవి బ్రతుకుటకుపయోగపడినది. మోటారు కొన్న డబ్బు అమెరికాలోని కోటీశ్వరులైన ఫోర్డు, రాక్‌ఫెల్లర్ లను బాగు చేయుచున్నది. ఏమి న్యాయము? 


ప్రముఖ వ్యాఖ్యలు

వేయి పడగలతోనేల దాల్చిన వాడు రెండు పడగలతో దంపతుల పాలించువాడు. ఒక్కపడగ విప్పి పైరు పచ్చకు గొడుగుపట్టినవాడు. త్రిమూర్త్యాకృతి, శూలము నాలుకయందు, శంఖ చక్రములు ఫణాగ్రముల యందు దాల్చిన దేవుడు, ధర్మమయ తనువు, కరుణాతరంగితాంతరంగుడై తన్ను గూడ తన పితరులవలెనే సంప్రదాయమునకు దూరము గాకుండ కాపాడువాడు నాకు ప్రసన్నుడగునుగాక! నన్ను సర్వదా రక్షించుగాక

 

విశ్వనాథ సత్యనారాయణ

 

విశ్వనాథ సత్యనారాయణ

 విశ్వనాథ వారిది విశిష్టమైన శైలి. అతను రచనల్లో లోకానుభవం తొంగి చూస్తుంది. అతను గురించి అతనుే చెప్పుకున్న ఈ వాక్యాలు అతను శైలిని అవగతం చేస్తాయి:
నాకవిత్వం అంతా నా జీవితంలోని అనుభవాలమయం. లోకవ్యక్తిని కావ్యవ్యక్తి నయ్యాను. దశరథుణ్ణి గూర్చి బంధుజ్యేష్ఠుడన్నాను, వేయిపడగలలో "రామేశ్వరశాస్త్రి బంధుజ్యేష్ఠుడు" అన్నాను. ఎవరీ బంధుజ్యేష్ఠుడు? మా నాయనగారు. నీ చుట్టువున్న లోకంలో నీకు చెందని భావం ఏముంటుంది? ఈ భావాలు. ఈ అనుభవాలు నీ మనస్సుపై వేసిన ముద్రలలో నుండే నీ మాటలు దొర్లుకొనివస్తాయి. నీవు కవివయితే ఆ శబ్దము వ్యంజకమై కావ్యత్వాన్ని పొందుతుంది. కవివయితే నంటే ఏమిటి? కవియైనవాడు లోకాన్ని చూచే దృష్టివేరు వానికి కనిపించే లోకము అందరు చూచే లోకమే

పలుచని బురదలోపల మానిసిని జూచి
         నెగచి యూకున దూకె నీటిపాము
వెలివడ్డ బొరియముంగలనిక్కి తెల్లబో
         యెను కొంగ కెఱగాని యెండ్రకాయ
ఒడ్డున బురదలో గొడ్డు గిట్టలు దిగి
         పడె జంఘదఘ్నమై పంటకాల్వ
జనుము చల్లుటకు తీసిన పాయ పాపట
         చక్కదీగిచి దిద్దె సస్యలక్ష్మి
    పలుచగా వేడియెక్కు బవళ్ళతోడ
    బైరగాలి పొరల్ తడియారజొచ్చె
    పగటి కుషసు నా నొప్పె నవార్షుకములు
    కాఱులకు దొల్తగా శరత్కాల లక్ష్మి

తెలుగు ఋతువులలో ఈ పద్యం వ్రాసాను. నేను మా పల్లెలో చిన్ననాడు చూచిన దృశ్యాలు ఎవరూచూడలేదా? చూసేవుంటారు కాని చెప్పలేదు. శక్తి లేక చెప్పకపోవచ్చు లేక ఆ దృష్టి లేకచెప్పకపోవచ్చు. కనుక ఎవడు కవి? ఆ శక్తి, ఆ దృష్టి ఉన్నవాడు.

 

 

బెల్లంకొండ రామదాసు

 

బెల్లంకొండ రామదాసు

చెరసాల

ఇన్నాళ్ళూ
సమాజం ఒక సంకెళ్ల చెరసాల!
హత్యలు జరిగిన చెరసాల!
నెత్తురు పారిన చెరసాల!
దుర్మార్గులు కట్టిన చెరసాల!
ఒక పెద్ద చెరసాల!
బానిసత్వ శాస్త్రం
శాసించిన పూజారులు
నెత్తుటి కత్తులు
ఝళిపించిన సామ్రాట్టులు
హత్యా మంత్రాంగం
పన్నిన అమాత్యులు
దుర్మార్గులు మఠాధిపతులు
నరహన్తలు మతాధినేతలు
ఒకటై
జరిపించిన ఘోరహత్య
తగిలించిన అనల శృంఖల
కట్టిన బానిసత్వ కారాగృహమది
గత కాలపు సమాజ పద్ధతి!
పుణ్యం పేరిట
యజ్ఞంలో నరికిన
పసి మేకల శిరస్సులూ
ఉరి బండల
ఆహుతైన
పతిత ప్రజా శిరస్సులూ
పూజారీ కర్మల్లో
రాజన్యుల కత్తుల్లో
నలిగిన అనాథుల ఆక్రందన
ఇదేనా
పూర్వపు సమాజ నిర్మాణం?
పర పీడనకై
పరిపాలనకై
స్వార్థ పరులు
తమ అధికారం నిలుపుకోను
మతాధి నేతలు
వ్రాసిన దుర్మార్గపు శాస్త్రశాసనం
తగిలించిన నియమ శృంఖల
రాజులు
ఏకచ్ఛత్రంగా
ఏలిన శవ సామ్రాజ్యం
ఇదే కదా గతకాలపు
సమాజ పద్ధతి!
పూజారుల అధికారం
రాజన్యుల నియంతృత్వం
కట్టిన పెద్ద జైలు కొట్టు
చేసిన మహాహత్య
ఇదే కదా పూర్వపు
సమాజ చరిత్రమంతా!
గుండెలు మంటలుగా
కన్నులు కాలువగా
మారుతాయి
ఈ సమాజ హత్యా చరిత్ర చూస్తే!
రాజన్యుల
రథ చక్రపు
ఘట్టనలో
పడి నలిగే
దీనులార!
మతాధి నేతల
శాస్త్రాల చెప్పుల క్రింద
నలిగి నలిగి రోదించే
పసితనంలో పతి పోయిన
అమాయక కన్యలార!
స్వేచ్ఛ లేక
సమ్రాట్టుల
నేత్రాగ్నుల
దగ్ధమైన
జాతులార!
మరలో
మరగా
అరిగిపోవు
కార్మికులారా!
జమీందార్ల
పొట్టలు నింపను
ధాన్యం పండించే
కర్షకులారా!
ఓహో!
ఓహో!
అణగారిన
ప్రపంచ దీనులారా!
మీకై
ఈనాడొక
అగ్ని పర్వతం
పగులుతోంది చూచారా!
మీకై
ఈనాడొక
అరుణ పతాకం
ఎగురుతోంది చూచారా!
మీకై
ఈనాడొక
నవజగత్తు
ప్రభవిస్తున్నది చూచారా!
మీకై
ఈనాడొక
నందనవన వసంత మందారం
కుసుమించెను చూచారా!
మీకై ఈనాడొక
రణభేరి
పగిలింది విన్నారా!
( నయాగరా ఖండకావ్య సంపుటి నుండి) 


chalam - చలం

 




Chalam is a form of traditional Indian poetry that originated in the state of Andhra Pradesh. It is characterized by its simple language and use of everyday imagery, making it accessible to a wide audience.

The word "Chalam" means "four lines" in Telugu, the language spoken in Andhra Pradesh, and each poem is typically composed of four lines. The poetry is known for its use of imagery drawn from nature and everyday life, as well as its ability to convey deep emotions and insights.

One of the most famous poets of Chalam is Sri Sri, whose work is widely read and loved in Andhra Pradesh. His poems often deal with themes of love, nature, and spirituality, and his simple, direct language has a profound impact on readers.

Another famous poet of Chalam is Kaloji Narayana Rao, who wrote extensively about the plight of the poor and working class. His poems are known for their powerful social commentary and political activism.

Chalam is an important part of the literary tradition of Andhra Pradesh and continues to be popular among readers today. It is widely taught in schools and universities, and many literary organizations and clubs hold regular poetry recitations and competitions to promote the art form.

In conclusion, chalam is a simple and accessible form of poetry that has its origin in Andhra Pradesh, India. It is known for its simple language, imagery drawn from everyday life and its ability to convey deep emotions and insights. Some famous poets of Chalam are Sri Sri and Kaloji Narayana Rao. Today, chalam is an important part of the literary tradition of Andhra Pradesh and continues to be popular among readers.

రెక్కలు విప్పిన రివల్యూషన్

 రెక్కలు విప్పిన రివల్యూషన్ పేజి 1

                                 


                            రెక్కలు విప్పిన రివల్యూషన్

                                   శ్రీశ్రీ

                 

    రివల్యూషన్ ఎక్కడో పుట్టదు. సామాన్య జనం గుండెల్లోనుంచీ, వ్యధార్తుల ఆకలి కేకల్లోంఛి ఊపిరి పోసుకునేది రివల్యూషన్....విప్లవం....
    చరిత్ర గతిని, మానవ ప్రవర్తనని మార్చిన మహాఘటన 1968 పారిస్ రివల్యూషన్.
    దాన్నే మహాకవి శ్రీశ్రీ మాటల్లో చెప్పాలంటే....
    "ఇది 1968, మే నెలలో పారిస్ లో సంభవించిన విప్లవపు కథ. విప్లవాలు చరిత్ర యొక్క సంబరాలు. సాంఘిక వాస్తవికత సాంఘిక స్వప్నంలో కలిసిపోయే క్షణం (రతి కార్యం).
    అవి ఎందుకు సంభవింఛాయనడానికి చెప్పుకొనే కారణాలెప్పుడూ అసమగ్రమే. వాటి వర్ణణలెప్పుడూ పాక్షికమే.
    మే విప్లవం కనిపించే దానికోసమూ(తిండి), కనిపించిన దానికోసమూ (ఒక నూతన వ్యవస్థ) జరిగిన పోరాటం.
    ఈ కథని ఉత్ప్రేక్షలలోనే చెప్పాలి. అగత్యం, చైతన్యం ఆచరణని తెచ్చాయి"
    ఒక్క యూరోప్ లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా మానవ విలువలను సమూలంగా మార్చిన ఈ రివల్యూషన్ గురించి తెలుగుదేశం గర్వించదగిన మహాకవి శ్రీశ్రీ రాసిన పుస్తకం ఇది.

                            నాంది
    
    ఇది 1968, మే నెలలో పారిస్ లో సంభవించిన విప్లవపు కథ.
    విప్లవాలు చరిత్ర యొక్క సంబరాలు. సాంఘిక వాస్తవికత, సాంఘిక స్వప్నంలో కలిసిపోయేక్షణం (రతి కార్యం).
    అవి ఎందుకు సంభవించాయనడానికి చెప్పుకొనే కారణాలెప్పుడూ అసమగ్రమే. వాటి వర్ణనలెప్పుడూ పాక్షికమే.
    మే విప్లవం కనిపించే దానికోసమూ(తిండి), కనిపించనిదాని కోసమూ (ఒక నూతన వ్యవస్థ) జరిగిన పోరాటం.
    ఈ కథని ఉత్ప్రేక్షలలోనే చెప్పాలి.
    అగత్యం, చైతన్యం ఆచరణని తెచ్చాయి.
    నూతన వ్యవస్థ మీద తీసుకున్న పోలీసు చర్య ప్రస్తుత సమాజ కళేబరాన్ని వెలిగించింది. ఇందులో పాల్గొన్న నటుల స్వప్నాలకు స్ఫటిక స్వచ్చ స్వరూపాన్నిచ్చింది.
    కనిపించేదంతా దాదాపు పూర్తిగా వెనక్కిపోయిందనవచ్చు. కనిపించనిది ప్రజల మనస్సుల్లో ఉంది. పాల్గొన్న వారి మనస్సులో.
    ఈ విప్లవానికి పూర్వం, ఇక మారదేమో అనిపించేటంత ముసలిదైన తూకాన్నిది తారుమారు చేసింది.  
    ఈనాటి అన్యాయం వల్ల ప్రోదిగొన్న చిన్నచిన్న వ్యక్తిగత భయాలకన్న, నూతన వ్యవస్థ పట్ల పెంచుకున్న సామూహికమైన ఆశలే ఎన్నోరెట్లు బలిష్టమైనవి.

                                              1

    బూర్జువా వర్గానికి ఒక సరదా వుంది,
    అన్ని సరదాలను అపకీర్తిపాలు చెయ్యడం.
    ప్లాష్ బాక్_నాన్ టెర్ ఒక సమకాలీన నీతికథ.
    1963. బుధవారం. ప్రతివారం జరిగే మంత్రివర్గ సమావేశం. ఒక యూనివర్శిటీ నివేశనం కావాలి. (అభ్యుదయం).
    వీలయితే పారిస్ చుట్టుపక్కల్లో (ప్రణాళిక)
    అప్పటిసైన్యం మంత్రి మైస్మర్, అప్పటి విద్యామంత్రి పూషేతో (మే 68లో హోంమంత్రి) "పారిస్ కి పడమరగా నాన్ టెర్ వద్ద నాకో చిన్న భూఖండం ఉంది. కావలిస్తే నువ్వు దాన్ని వాడుకోవచ్చు." (రాజకీయం)
    అది బంజర్లూ, గుడిసెల ఊళ్లూ ఉన్న ప్రాంతానికి మధ్య ఒక విమానశాఖ డిపో.
    నాన్ టెర్ లేచింది _ 1968. కాంక్రీట్ తో, గాజుతో కట్టడాలు_ 16-17 వార్డులలో నివశించేనడి మీ తరగతి కోసం. ఇంకా సంపన్న ప్రాంతాలు. పట్టణ సమాధులు. కార్లకి పార్కింగ్ స్థలాలు. లెక్కలేనన్ని, సంపన్నుల సుపుత్రుల కోసం. ఈ కుర్రాళ్ళు ఉమ్మడి కుటుంబంలోనే వుంటూ మమ్మీ (మాతృదేవత), సొంత కార్లు వాడుతూ ఉంటారు. (కుటుంబం)
    భవనాల చుట్టూ, అరబ్బులు, బుడత కీచుల దరిద్రపు గుడిసెలు.
    జీవితపు అంచులలో బక్కచిక్కిన కుర్రాళ్లు, పుట్ బాల్ ఆడుతూ (పైకి కనిపించే ఎముకలు! వాళ్ళు వాడే బూతులు!) పొగగొట్టాలు, కౌన్సిల్ భవనాలు, బంజరు భూములు. గోడల మీద పిచికారీ పిస్తోలుతో వ్రాసిన:
    నాగరికత, పరిశుభ్రత, రతిక్రీడాపరాయణత.
    12 వేల స్టూడెంట్లు, 15 వందల హాస్టళ్ళలో.
    వారానికోసారి డాన్సింగ్. రెండుసార్లు సినీ క్లబ్బు. మిగతా రాత్రులంతా టెల్లీ. (టెల్లీ అంటే టెలివిజన్)టెల్లీ ప్రజలకు నల్లమందు, మేధావుల ఆత్మహింసా సాధనం. (సంస్కృతి)
    ఒకగోడ మీద పురుగులాగ నీమొహాన్ని కిటికీగాజు తలుపుకి కొట్టుకొని కుళ్లిపో.
    చక్కని స్టెరిలైజ్ చేసిన గదులు: పెద్దగాజు కిటికీలు _ అరబ్బీ మైదానాలు కనిపిస్తూ "పరాయి" దేశీయులకు ప్రవేశం లేదు. ఫర్నిచర్ మార్చకూడదు. కొత్తవి చేర్చకూడదు. వండుకోకూడదు. యూనివర్శిటీ ఆవరణలో రాజకీయాలు నిషేధం.
    బయట గోడల మీద: ఇక్కడితో స్వేచ్చ అంతమవుతుంది.
    అమ్మాయిలు(21 ఏళ్ళు దాటితే, లేదా తల్లిదండ్రుల ప్రత్యేకానుమతి ఉంటే) అబ్బాయిల గదుల్లోకి వెళ్ళవచ్చు. కాని అబ్బాయిలు అమ్మాయిల గదుల్లోకి వెళ్ళడానికి వీల్లేదు. ఎంచేతంటే_ మంత్రిగారి మాటల్లో_ ప్రకృతికి తన నియమాలు తనకున్నాయి. వాటిని మరిచిపోవడం కంటే అంగీకరించడం మంచిది. అదీకాక _మంత్రి ఉవాచ_ 'బాలికలకు తమ ఆడ ప్రపంచంలో బాలురు ప్రవేశించడం నిజంగానే ఇష్టం వుండదు' (నీతులు).
    ఒక పిడికెడు మంది మావోయిస్టులూ, ట్రాట్సీయిస్టులూ, అనార్కిస్టులూ, సిట్యుయేషనిస్టులూ, ఔను, వీరితో బాటు కాన్ బాందీ. (తీవ్రవాదాలు)
    అదీ, ప్రళయానికి పూర్వం.
    సాంఘిక శాస్త్ర విద్యార్థులచే ఎక్కువ చైతన్యం. కాని మిలిటెంట్లు శూన్యంలో పనిచేస్తారు. జనాన్ని సమీకరించడానికి వాళ్లకు ఉన్నదొకే సమస్య. వియత్నాం. (ఎడమపక్షపు పుక్కిటి పురాణాలు, అధిక సంఖ్యాకులను దూరం చేసుకోవడం, కొద్దిమంది అర్థం చేసుకున్నవాళ్లు).
    నల్ల జాబితాలో కొన్ని పేర్లు. మిలిటెంట్ల పేర్లు. పిల్లల తండ్రీ, ఉదారవాదీ అయిన యూనివర్శిటీ విద్యాధికారి గ్రాపస్, అసలు నల్లజాబితా లేదు మొర్రో అంటాడు.

 

Click here for full pfd

WORK HARDER THAN EVERYBODY - Motivational Speech 2023

మ్యూజింగ్స్ -2 -- గుడిపాటి వెంకట చలం


   


   మ్యూజింగ్స్ -2

 

 

                                                        చలం

                       

    గుండ్రంగా బలిసిన పిల్లి యెండలో పడుకుని వుంది__తెల్లని పిల్లి. దాన్ని చూస్తే మా వూళ్ళో నిత్యసంతోషిగా కనపడే స్త్రీ సంఘోద్ధారకురాలు ఒకామె జ్ఞాపకమొస్తోంది. చాలామంది కిట్లా గట్టి పోలికలుంటాయి. ఒక మిత్రుడి మొహం దేనినో పోలివుందని, ఆ వుపమానం మనసుకి స్ఫురించక చాలా నెలలు వూరుకున్నాను. మొన్న బస్సుకి అడ్డంగా నుంచున్న ఒక ఒంటెను చూసేటప్పటికి ఆ ఒంటె మూతికోసం ఇన్నాళ్ళు వెతుకుతున్నాననిపించింది. ఆ పిల్లి యిట్లా పడుకుందా ఎండలో కళ్ళుమూసుకుని, దాని కళ్ళు చుట్టూ ఎగిరే పిచ్చికల మీదే వున్నాయి. దానికి ఆ పిచ్చికలు యీకలు కట్టుకున్న లడ్డుండల్లాగూ, ఎగిరే ఇడ్డెనల్లాగూ కనిపిస్తాయి గావును! చేతులో కానీ లేక మిఠాయి దుకాణం ముందు నుంచున్న కుర్రాడి బాధగావును దానికి! పిల్లి జన్మలో పాపం అనుభవించే పద్ధతి అదేమో!
    చెరువునించి నీళ్లు మోస్తో సీత గుమ్మం ముందునుంచి వెళ్ళినప్పుడల్లా నావంక చూస్తోంది. ఏమిటా ఆకర్షణ? పట్టణం మొగవాడు. అధికారి. అదిగాక పూర్వానుభవాల స్మరణ కొంతవరకు పనిచెయ్యవొచ్చు. ఏమిటా ఆశ? ఏమో! ఏ ఐదు నిమిషాలో దొరకవా అనా? అంతమాత్రము యోచనా వుండదు. పిల్లి అట్లా పిచ్చికల వంక ఎందుకు చూస్తూ వుంది? ఏమిటా ఆశ? ఏమీలేదు అట్లానే! అంతే సాధారణంగా యీ సంబంధాలలో దొరికేది ఆ ఐదు నిమషాలే. అట్లాంటప్పుడు కవిత్వానికీ రొమాన్సుకీ వ్యవధి యేదీ? అందువల్లనే స్త్రీకి ప్రేమ అనగానే కటికినేల జ్ఞాపకం వస్తుంది, యీ పల్లెటూళ్ళలో_ ముఖ్యంగా కనిగిరిలో! ఏం? సుబ్బారావ్ c/of గంగానమ్మ! ఏమంటారు?
    పురుషుణ్ణి వెతుక్కోడానికి అలవాటయిన స్త్రీ చూపులు అదో విధంగా తయారవుతాయి వేశ్య చూపులు వేరు. అవి ధనం కోసం వెతుకుతాయి. ఈ స్త్రీల చూపులు మోహం కోసం - కాదు అవయవాల కోసం వెతుకుతున్నాయా అన్నంత అసహ్యంగా వుంటాయి. మరీ __ మ్మకి దేహమంతా, (మనసు కూడానేమో!) అంతా కూడా ఒక్క అవయవం చుట్టూ యేర్పడ్డ సహాయక ప్రదేశం వలె వుంటుంది.
    కొంతమంది స్త్రీలలో ఆకర్షణ పువ్వుల్నీ, చల్లని నీలపు నీటినీ, జ్ఞాపకం తెస్తుంది. ఎంతైనా కళ్ళవేపూ పెదవుల వైపే నిలుస్తుంది ఆరాధకుడి దృష్టి. స్త్రీలో ఔన్నత్యం తలుచుకున్నప్పుడల్లా చిన్న జ్ఞాపకం వస్తుంది. నేను చేసిన నిరాకరణా, ఆత్మత్యాగమూ అనవసరము అర్ధవిహీనమూనా? ఇట్లాంటి సంయోగాలకీ వియోగాలకీ ఆ రెంటి మధ్యా, వ్యక్తమై బాధించిన సంకోచాలకీ, త్యాగాలకీ, విచారాలకీ అంతం, సాఫల్యం, ఏమైనా వుందా, లేక ఆ అనుభవమే ఆ త్యాగమిచ్చిన మాధుర్యమే అంతమా? కాని ఇంకేం సఫలం కావాలీ? చి__ని మళ్ళీ కలుసుకోవాలా? ఈ లోకంలోనో ఇంకో లోకంలోనో ఆమెనించి కృతజ్ఞతను పొందాలా? ఇక్కడ మధ్యలో త్యజించిన ప్రేమ అనుభవాన్ని మళ్ళీ "కంటిన్యూ" చెయ్యాలా? ఇట్లాంటి ప్రశ్నలకి ఇష్టమయిన 'హాప్ ఫుల్' సమాధానాలు చెప్పుకుని ఎంతమంది ఆ కలలలో ఆనందపడడం లేదు? ఈ త్యాగాలకి హర్షించి భగవంతుడు ఊర్ధ్వ లోకాలు కటాక్షిస్తాడనీ, ఇంకో జన్మలో సౌఖ్యాలు ఏర్పాటు చేస్తాడనీ, ఆమెనే ప్రియురాల్ని చేస్తాడనీ, కరుణించి ఆ వ్యక్తినే ముసలితనములో ప్రసాదిస్తాడనీ ఎంతమంది, ఎన్ని మతాలవారు, ఎన్ని విధాల నమ్మటం లేదు! ముఖ్యంగా కర్మలో నమ్మే యీ దేశస్థులకి ప్రతి పనికీ ప్రతిఫలం యెదురుచూడడం అలవాటయిపోయింది. ప్రతిఫలం ఆ త్యాగంలో తప్ప ఇంక లేదనే నమ్మితే యిన్ని దొంగ ధర్మాలూ, కపటపు నీతి వర్తనలూ, వుండవు కాని ఏ భవిష్యత్తులోనూ నమ్మకం లేని నాబోటి వాళ్ళకు ఒక idea కోసం ఆదర్శం కోసం శరీర సుఖాన్ని - అందులో ప్రేమానందాన్ని త్యాగం చెయ్యడం దుష్కరమౌతుంది. ఎవర్ని ప్రేమిస్తున్నామో వారి క్షేమానికయితేనే గాని ఏ త్యాగమూ అర్ధవిహీనంగా కనపడుతుంది. కాని ఆమె క్షేమం కోసం మాత్రం నేనెందుకు త్యాగం చెయ్యాలి, ఆ త్యాగం వల్ల ఆమె నా చేతులోనించి జారిపోయేటప్పుడు? అయినా నా త్యాగం ఆమెకి క్షేమమని నమ్మకమేమిటి? ఆమె నా త్యాగానికి feel అవుతుందా, నన్ను admire చేస్తుందా?
    హృదయ తృప్తితప్ప సమాధానం లేదు. అంటే ... అంతరాత్మా! మతాలు బోధించే అంతరాత్మా!
    అంతరాత్మ అనేది వుందా? వుంటే అందరికీ ఒకే విధమైన అంతరాత్మా! మరి దేశకాల పరిస్థితులతో మారుతుందేం?
    చి__ని నేను కలుసుకోవాలని ప్రతి నిమిషం హృదయం దహిస్తుంది. కాని కలుసుకుంటే! తరవాత! ఆ పునస్సమాగమంలో నించి జనించిన అగ్ని ఎన్ని జీవనాల అగ్ని ఎన్ని జీవనాల ఆనందాన్ని ఆహుతి తీసుకుంటుంది?
    __న్నా! ఏం లాభం లేదు. మనిద్దరం ఇట్లా పరితపించి మళ్లీ కలుసుకుంటే మాత్రం యీ వేదన అంతమౌతుందా? ఎంతో దగ్గిరగా మనం కావిలించుకున్నా, ఎంత కాలం ఒకర్ని ఒకరం విడవకుండా కళ్ళలోకి చూసుకున్నా మనకీ హృదయ తాపం తీరుతుందా? తనివితీరా ముద్దు పెట్టుకోడం అని వ్రాస్తారుగాని నిజంగా ముద్దులతోగాని, ఇంకా దేహ ఐక్యంవల్లగాని తనివితీరే ప్రేమ చాలా అల్పం. ఆ మనుషులు చాలా అల్పులు, నన్ను నీకూ, నిన్ను నాకూ ఇంత ఆకర్షకంగా చేసి అగ్ని త్యాగాలకు పురికొల్పే యీ శక్తి ప్రత్యేకమయిన మన హృదయ దాహం కాదు. మన ఆత్మ ఔన్నత్యమే ఇట్లా వేరుపరిచింది మనని నిరంతరం అగ్నితో కాలుస్తోంది.
    "ఇంత పరాకా..." అని విన్నప్పుడల్లా, నిన్ను మరిచానని, ఆపాట పాడుతున్నవేమోనని వులికిపడి, నీ తేపిలో తడిసిన పదాలూ, పెదవులూ, చీకట్లో నీ చూపులు, తివాసీ, అన్నిటి జ్ఞాపకాలతోనూ పరాకులో పడతాను. "ఇంత పరాకా_" నాకు కాకుండా చేశావు నువ్వు పాడి.
    "ఈనాడు నన్నిట్లా పూజిస్తున్నావు సరే. ఇదివరకెందర్ని పూజించలేదు నువ్వు?" అన్నావు.
    "నీకెట్లా తెలుసు?"
    "నీ కథలు; నీ లేఖలు..."
    "కాని నీమీది వాంఛ వేరు."
    "నమ్మాననుకో. ఇకముందు? నాకన్న నువ్వు వాంఛించే వ్యక్తే ముందు ఎప్పుడో ప్రత్యక్షమయితే..."
    "కాదు."

 

Read more Click here

తల్లి మనసు కధలు పేజి

  తల్లి మనసు కధలు పేజి 1

                                 


                                        తల్లి మనసు
                                                                               డి. కామేశ్వరి

 

                                        

   
    పావుతక్కువ తొమ్మిదయింది . కమల గబగబ జడ అల్లుకుని, ముఖానికి యింత పౌడరద్దుకుని వంటింట్లోకి వెళ్ళింది.
    పొయ్యి మీద యింకా ఏదో వుడుకుతూనే వుంది. అత్తగారికింకా గిన్నెలతో కుస్తీ పడుతుంది. వంటకాలేదన్న మాట! తెలిసినా అడిగింది కమల "వంటయిందాండి.... తొందరగా ఆఫీసు కెళ్ళాలి యివాళ ...."
    "ఆ! ఆ ! అవుతుంది. చూస్తున్నావుగా నేనేం కూర్చున్నాన్నా! అక్కడికీ రోజుకంటే అరగంట ముందే మడికట్టు కున్నాను. ఉడకాలా వాటితో పాఫు నేనూ వుడుకుతానా? ఇదిగో యీ పప్పుదింపి ఆ పులుసు పోపు కూరపోపు వేసి పెడ్తాను.... దిక్కుమాలిన కర్రలు మండి చస్తేనా? ఊదిఊది నోరు పడిపోతుంది కళ్ళు పోతున్నాయి...." సుబ్బమ్మ దండకం మొదలుపెట్టింది.
    ఈ భాగోతం రోజూ వినేదే కనుక కమల ఆ మాటలు వినకుండా పీటవాల్చుకుని కంచం పెట్టుకుని, మజ్జిగ గిన్నె దగ్గర పెట్టుకుంది. "ఎంతవరకయితే అదే పెట్టేయండి. తొమ్మిదిన్నరకి అక్కడుండాలి నేను. ఇన్ స్పెక్టన్ వుంది. "ఉదయమే చెప్పింది తొందరగా వెళ్ళాలని; అయినా ఆవిడకేం లెక్క! వుండవే అలా కాళ్ళ క్రింద నిప్పులు పోసేస్తే ఎలా చస్తాను ----" అంటూనే పప్పులో యింక ఉప్పు వేసి కుమ్మి అదే యింక కంచంలో పడేసింది. తీర్దానికి తీర్ధం ప్రసాదానికి ప్రసాదం లాంటి పులుసు కాస్త ఒగిన్నేలో పోసింది. ఉమ్మగిల్లని అన్నం యింత పడేసింది కంచంలో . "కూర అవనీయవు.... ఏం ఉద్యోగాలో నీవే చేస్తున్నట్టున్నావు..... నిన్నటి చింతకాయ పచ్చడి వేయనా ...." అదో యింత ముద్ద పడేసింది సుబ్బమ్మ.
    కమల దేనికి జవాబియ్యకుండా ఊదుకుంటూ యింత పప్పు అన్నం కలుపుకుని తిని మజ్జిగ వేసేసుకుంది.
    "అయ్యో రాత! ఏమిటే ఆ తిండి " సుబ్బమ్మ నోరు వాగుతూనే వుంది. కమలకిదేం క్రొత్తగాదు యీ యింట్లో ఏనాడో చెవులు, నోరు మూసుకోవడం అలవాటయింది కమలకి.
    ఇదేం క్రోత్తా! రోజూ ఆఫీసు వేళకి యింత వండి కంచంలో పెట్టడానికి ఆపసోపాలు పడుతుంది అత్తగారు, అక్కడికి కూరలు తరిగిస్తుంది, బియ్యం కడిగిస్తుంది . మజ్జిగ త్రిప్పుతుంది. గిన్నెలు కడిగి లోపల పెడుతుంది. అన్నీ పొయ్యి దగ్గర అమిరిస్తే ఆ వంట కాస్తా వండటానికి పెద్ద కష్టపడిపోతున్నట్టు మాట్లాడుతుంది. ఆవిడ మడికి పనికిరాదని వూరుకోడం గాని యీ మాత్రం వంట అరగంటలో వండి, తిని, ఆఫీసు కెళ్ళగలదు తను. రోజూ యిలాంటి భోజనం అలవాటే, ఉడికీ ఉడకని పప్పు, ఉమ్మగిల్లని అన్నం, కాగీ కాగాని పులుసుతో ఏదో యింత నోట్లో పడేసుకుని అదర బాదరా అఫీసుకి పరిగెత్తడం తనకి ఆయనకీ అలవాటే రోజూ ! ఈతిండితో సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి తోటకూరకాడల్లా వాడిపోవడమూ అలవాటే. మధ్యలో అక్కడ త్రాగేది కప్పు కాఫీ!
    "వాడెడి ? వాడు రాకుండానే తినేసి పోతావుటే....?"
    కమల జవాబు చెప్పకుండా కంచం ఎత్తి మూలపడేసి చేయి కడుక్కుంది.
    ఆయనగారు తిన్నాక అవిస్తట్లోనే తినాలి. పతివ్రతా ధర్మాలు నెరవేర్చాలంటే ఆఫీసుకి వెళ్ళడం ఎలా కుదురుతుంది? ఈ మాత్రం తోచదు కాబోలు! మొగుడంటే భక్తీ గౌరవం లేనట్టు లెక్క గాబోలు ముందు తింటే !
    ఆఫీసులో ఇనస్పెక్షన్ వుంది. తొమ్మిదిన్నరకి అక్కడ ఉండాలి. రెండు బస్సులు మారి వెళ్ళాలి. అప్పుడే తొమ్మిదయింది ... ఆయనగారు వచ్చి అయన తిన్నాక తినాలంటే ఎలా కుదురుతుంది ?
    కోపం వచ్చినా జవాబు చెప్పలేదు కమల. గదిలోకి వెళ్ళి చెప్పులు తీసుకుని బేగు రుమాలు తీసుకుని గబగబ వెళ్ళింది వీధిలోకి.
    గుమ్మంలోనే ఎదురు పడ్డాడు సుబ్బారావు . సైకిలికి ఎడాపెడా సంచులు తగిలించుకుని "అప్పుడే ఎక్కడికి బయలు దేరావు?" భార్యని చూసి అడిగాడు.
    "ఆఫీసుకి."
    "తొమ్మిదే అయింది ఎందుకా తొందర భోం చేసి వస్తాను, వుండు వెడదాం.'
    "నాకు పనుంది. తొందరగా వెళ్ళాలి. మీరు తర్వాత వెళ్ళండి. ' తప్పించుకొని మెట్లు డిగింది కమల.
    "ఏమిటో ఆ అర్జంటు పని ! ముందెళ్ళి అందరితో బాతాఖానీ కొట్టాలా వెళ్ళు ..... వెళ్ళు.... అక్కడే కబుర్లు నీకోసం చూస్తుంటాయి."
    "ఏదీ పోనీ పాపం బస్సులు అవి వంటరిగా మారలేదని" కమలకు వళ్ళు మండింది. తీక్షణంగా చూసింది మొగుడి వైపు. 'అవును బాతాఖానీ కొట్టడానికే వెడుతున్నాను. దారి వదలండి' రోడ్డు మీద అంతకంటే ఘాటుగా జవాబీయటం ఇష్టం లేక మొహం త్రిప్పుకుని వడివడిగా వెళ్ళింది కమల. సుబ్బారావు భార్య వైపు కోపంగా చూసి లోపలికి వెళ్ళాడు.
    బాతాఖానీ కొట్టడానికి వేడుతూందిట..... 'అందుకోసం గంటముందు తిండన్న తినకుండా ఆదరాబాదరా బయలుదేరింది ! హ ఏం మగాళ్ళు! ఓ పావుగంట ముందు వెడితే ఎందుకోనని అనుమానం! ఆఫీసులో మొగాళ్ళతో పెళ్ళాం ఖాతాఖానీ కొడుతుందేమోననే మొగాళ్ళు  భార్యని ఉద్యోగంలో ఎందుకు ప్రవేశ పెట్టడం! భార్య తెచ్చే డబ్బు కావాలి! కాని ....ఆభార్య తోటి ఉద్యోగాస్తునితో నన్నా ఓ మాట మాట్లాడకూడదు నవ్వకూడదు. తలవంచుకొని ఆఫీసుకెళ్ళి ఇంటికి రావాలి. ఇంత సంకుచిత్వం మనసులో పెట్టుకుని పైకి పెద్ద ఆదర్శ వాదుల్లా అభ్యుదయ భావాలు గల వారిలా భార్యని ఉద్యోగం చేయిస్తున్నట్టు ఫోజు....! .... హ బస్సులు ఎక్కలేదట! ఏ బస్సులు ఎక్కకుండానే రెండేళ్ళ బట్టి ఉద్యోగం చేస్తుంది గాబోలు! ఎంత చులకన ..... పెళ్ళాం అంటే ..

 

Full PDF  Click Here

 మకర సంక్రాంతి

మకర సంక్రాంతి

రంగుల గాలిపటాలు లక్నోలో ఒక షాప్ లో అమ్ముడుపోతున్నాయి
అధికారిక పేరు    makara sankranthi
యితర పేర్లు    సంక్రంతి
రకం    కాలానుకూలంగా, సాంప్రదాయంగా
ప్రాముఖ్యత    హార్వెస్ట్ ఫెస్టివల్, శీతాకాలము అయనాంతం వేడుక
జరుపుకొనే రోజు    సూర్యుడు (సన్) మకర రేఖ నుండి దూరంగా ఉన్నప్పుడు రోజు (జనవరి మధ్యలో) దాని గతి (ఉద్యమం) ప్రారంభమవుతుంది
ఉత్సవాలు    గాలిపటం ఎగిరవేయుటము
సంబంధిత పండుగ    రైతులు పండుగ, ఉత్తరాయణ పుణ్యకాలం,తిల తర్పణం
సంక్రాంతి పండుగలో గొబ్బెమ్మల చుట్టూ నృత్యం చేస్తున్న అమ్మాయిలు



సంక్రాంతి లేదా సంక్రమణము- అంటే "మారడం" అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి. అందుచేత సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి. అయినా పుష్యమాసంలో, హేమంత ఋతువులో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇది జనవరి మాసంలో వస్తుంది. మకర సంక్రాంతి రోజున, అంటే జనవరి 15 తేదీన సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు. ఈరోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి.

ఆంధ్రులకు, తమిళులకు పెద్ద పండుగ సంక్రాంతి.ఇది కొన్ని ప్రాంతాలలో మూడు రోజులు ( భోగి, మకర సంక్రమణం, కనుమ) కొన్ని ప్రాంతాలలో నాలుగు రోజులు (నాలుగోరోజు ముక్కనుమ ) జరుపుతారు కావున దీన్ని పెద్ద పండుగ అంటారు. ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగ జరుపుకుంటారు కాబట్టి రైతుల పండుగగా కూడా దీన్ని అభివర్ణిస్తారు. మకర సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది.

నిజానికి ధనుర్మాసారంభంతో నెల రోజులు మూమూలుగానే సంక్రాంతి వాతావరణం చలిచలిగా తెలుగునాట ప్రారంభమవుతుంది. ఆ నెల రోజులు తెలుగు పల్లెలు ఎంత అందంగా, ఆహ్లాదకరంగా అలరారుతాయి. బుడబుక్కలవాళ్లు, పగటివేషధారులు, రకరకాల జానపద వినోద కళాకారులు తయారవుతారు. ఈ పండుగకు దాదాపు నెలరోజుల ముందునుంచే - ప్రతీ రోజు తమ ఇళ్ళ ముంగిళ్ళను రంగవల్లులు, గొబ్బెమ్మ లతో అలంకరిస్తారు. ముగ్గులు వేయటానికి ప్రత్యేకంగా

బియ్యపు పిండిని వాడతారు. కళ్లం నుంచి బళ్ల మీద ధాన్యం బస్తాలు వస్తూ ఉంటాయి. భోగినాడు భోగిమంట విధిగా వేయవలసిందే. ఆ సాయంత్రం పేరంటంలో పిల్లలకు భోగిపళ్లు తప్పవు. ఈ పెద్ద పండుగకు కొత్త అల్లుడు తప్పనిసరిగా అత్తవారింటికి వస్తాడు. మరదళ్ల ఎకసెక్కాలకు ఉడుక్కుంటాడు. కోడి పందాలు, ఎడ్ల బళ్ళ పందాలు జరుగుతాయి. ఇవన్నీ సంక్రాంతి పండుగకు శోభ చేకూర్చే సర్వసామాన్య విషయాలు.




ఉత్తరాయణ పుణ్యకాలం

-------------------------

సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణము. మకర సంక్రమణము నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభము అవుతుంది. ఆ తరువాత కుంభ, మీన, మేష,వృషభ, మిథున రాశులలో కొనసాగినంత కాలము ఉత్తరాయణము. శారీరక పరిశ్రమకు, పూజలకు, సాధనలకు, కృషికి అనువైన, ఆవశ్యకత ఉన్న కాలము ఉత్తరాయనము.కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన దగ్గరినుండి మొదలై, ఆ తరువాతసింహ, కన్య, తుల, వృశ్చికం, ధనూ రాశులలో కొనసాగినంత కాలము దక్షిణాయణము. మానసికమైన అర్చనకు,ధ్యానానికీ, యోగానికీ, దీక్షలకు,బ్రహ్మచర్యానికి, నియమ నిష్టలకు అనువైన, ఆవశ్యకత ఉన్న కాలము దక్షిణాయణము. పన్నెండు నెలల సంవత్సర కాలములో ఆరు నెలల దక్షిణాయణము దేవతలకు ఒక రాత్రి, ఆరు నెలల ఉత్తరాయణము దేవతలకు ఒక పగలు. కనుక దేవతలు మేలుకునే కాలము ఉత్తరాయణ పుణ్య కాలము. కనుకనే ఉత్తరాయనము వరకూ ఎదురు చూసి ఉత్తరాయణము ప్రవేశించిన తర్వాత తనువును చాలించాడు మహానుభావుడైన భీష్ముడు.

"సంక్రాంతి" లేదా "సంక్రమణం" అంటే చేరుట అని అర్ధం. జయసింహ కల్పద్రుమం అనే గ్రంథంలో "సంక్రాంతి"ని ఇలా విర్వచించారు - తత్ర మేషాదిషు ద్వాదశ రాశి క్రమణేషు సంచరతః సూర్యస్య పూర్వస్మాద్రాశే ఉత్తరః రాశౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః - మేషం మొదలైన 12 రాశులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తరువాతి రాశిలోనికి ప్రవేశించడమే సంక్రాంతి [2]- సూర్యుని చలనంలో (రధయాత్రలో) ఘట్టాలు నాలుగు. అవి మేష, తుల, కటక, మకర సంక్రమణాలు. వీటిలో మకర సంక్రమణాన్ని "సంక్రాంతి పండుగ"గా వ్యవహరిస్తారు.మార్గశిరం పూర్తి కాగానే ఉత్తరాయణం మొదలవుతుంది.

దానాదులు.

ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేయు ఏ దానమైన శ్రేష్టమైనదని చెప్పబడింది. ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు దుంపలు, నువ్వులు, చెరకు మొదలయినవి దానం చేస్తారు. ఇవి కాక ఈ కాలమందు చేయు గోదానం వలన స్వర్గ వాసం కలుగునని విశ్వసిస్తారు.


భోగి

--------
ఇది సాధారణంగా జనవరి 14న జరుపుతారు. ఈ రోజున ఉదయం తెల్లవారక ముందే, అంటే 3:30, 4:00 మధ్యలో అందరూ లేచి భోగి మంటలు వెలిగిస్తారు. దీనిని సంవత్సరంలో ఆ కాలంలో ఉండే చలి పారద్రోలటానికే కాక ఇంకో సందర్భంగా కూడా జరుపుకుంటారు. ఇంట్లో ఉండే పాత చీపుర్లూ, తట్టలూ, విరిగిపోయిన బల్లలూ వగైరాలను వదిలేసి, కొత్తవాటితో నిత్య నూతన జీవితం ఆరంబించటానికి గుర్తుగా కూడా ఈ రోజున భోగి మంటలు వెలిగిస్తారు.

సాయంత్రం పూట చాలా ఇళ్ళలో స్త్రీలు, చిన్న పిల్లలు బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు.దీనిలో పిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆటవస్తువులను ప్రదర్శనగా ఉంచి ఆనందిస్తారు. ఇంకొంత మంది భోగి పళ్ళ పేరంటం ఏర్పాటు చేస్తారు. ఇక్కడ పేరంటాళ్ళు, బంధువులు సమావేశమై, రేగిపళ్ళు, శనగలు,పూలు, చెరుకుగడలు, కొన్ని నాణాలను కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టి తొలగిస్తారు. ఈ పేరంటానికి వచ్చినవారికి తాంబూలాలతో పాటు పట్టుబట్టలు, పసుపు, కుంకుమలు పెట్టడం ఆనవాయితీ.




కనుమ

-------------
మూడవ రోజయిన కనుమ వ్యవసాయంలో తమకు ఎంతో చేదోడువాదోడు ఉన్నందుకు పశువులకు శుభాకాంక్షలు తెలుపటానికి జరుపుతారు. కొన్ని ప్రాంతాలలో కోడి పందాలు కూడా నిర్వహిస్తారు. అయితే ఆ పందాలను జీవహింసగా భావించి రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. అంతే కాదు, వనభోజనాలను కూడా ఈరోజే నిర్వహిస్తుంటారు. కనుమ నాడు మినుము తినాలనేది సామెత. దీనికి అనుగుణంగా, ఆ రోజున గారెలు, ఆవడలు చేసుకోవడం ఆనవాయితీ. కనుమ మరునాటిని ముక్కనుమ అని అంటారు. దీనికి బొమ్మల పండుగ అని పేరు. దక్షిణ భారతదేశం లోని ప్రజలు ఈ పండుగ మూడు రోజులను శ్రద్ధాసక్తులతో జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో మాత్రం ఈ పండుగలోని రెండవ రోజయిన మకర్‌సంక్రాంతి లేదా లోరీని మాత్రమే జరుపుకుంటారు.

కనుమ రోజున మాంసాహారం తినడం ఆంధ్ర దేశాన ఆనవాయితీగా వస్తూంది. మాంసా హారులు కాని వారు, గారెలతో (మినుములో మాంసకృతులు హెచ్చుగా ఉంటాయి కనుక దానిని శాకా హార మాంసంగా పరిగణించి కాబోలు) సంతృప్తి పడతారు. అలాగే కనుమ రోజున ప్రయాణాలు చెయ్యకపోవడం కూడా సాంప్రదాయం.

పండుగ ప్రత్యేకతలు

---------------------



ముగ్గులు


రాళ్ళూ రప్పలూ లేకుండా ఒక పద్ధతిలో అలకబడిన నేల, మేఘాలు లేని ఆకాశానికి సంకేతం. ఒక పద్ధతిలో పెట్టబడు చుక్కలు రాత్రి వేళ కనిపించే నక్షత్రాలకు సంకేతం. చుక్కలచుట్టూ తిరుగుతూ చుక్కలను గళ్ళలో ఇమిడ్చే ముగ్గు ఖగోళంలో ఎప్పడికప్పుడు కనిపించే మార్పులకు సంకేతం. ఎంత పెద్దదైనా చిన్నదైనా ముగ్గు మధ్య గడిలో పెట్టే చుక్క సూర్యు స్థానానికి సంకేతం. ఇంకొక దృక్పథంలో గీతలు స్థితశక్తికి (స్టాటిక్‌ ఫోర్స్‌),చుక్కలు గతిశక్తి (డైనమిక్‌ ఫోర్స్‌)కు సంకేతాలని, ముగ్గులు శ్రీ చక్ర సమర్పనా ప్రతీకలని శక్తి తత్త్వవేత్తలు అంటారు[3]. ఇక వివిధ ఆకారాలతో వేయు ముగ్గులు విల్లు ఆకారం పునర్వసు నక్షత్రానికీ, పుష్పం పుష్యమీ నక్షత్రానికీ పాము ఆకారము ఆశ్లేష కూ, మేక, ఎద్దు, పీత, సింహం, ఇలాంటివి మేష, వృషభ, మిధున, కర్కాటక రాసులకూ, తొమ్మిది గడుల ముగ్గు నవగ్రహాలుకూ సంకేతాలుగా చెప్పచ్చు.

రధం ముగ్గు


పశ్చిమగోదావరి జిల్లాలో రథం ముగ్గు
గుంటూరులో సంక్రాంతిని గుర్తుతెచ్చే ముగ్గు

మూడు రోజులతో పూర్తవుతూ అందరికీ ఆనందాన్ని పంచే పండుగను ఘనంగా సాగనంపేందుకు పుట్టినదే రధం ముగ్గు. అందరూ ఒకరికి ఒకరు తోడుంటూ కలసి సహజీవనం సాగించాలి అనే సంకేతాలతో ఒక రథం ముగ్గు తాడును మరొక ఇంటి వారి ముగ్గుతో కలుపుతూ పోతూంటారు.

గొబ్బెమ్మలు


పెద్ద వయసు స్త్రీలు ముగ్గులు పెడుతుంటే చిన్న వయసు ఆడపిల్లలు ఆవు పేడతో చేసి పెట్టే గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాళ్ళైన గోపికలకు సంకేతం. ఈ ముద్దల తలమీద కనుపించే రంగుల పూలరేకులు, పసుపు కుంకుమలు ఆ గోపికలందరూ భర్తలు జీవించియున్న పునిస్త్రీలకు సంకేతం. ఆ గోపికా స్త్రీల రూపాలకు సంకేతమే గోపీ+బొమ్మలు= గొబ్బెమ్మలు. మధ్య ఉండే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం. సంక్రాంతి రోజులలో వీటి చుట్టూ తిరుగుతూ పాటలు పడుతూ నృత్యం చేసే బాలికలంతా కృష్ణ భక్తి తమకూ కలగాలని ప్రార్థిస్తుంటారు. దీనిని సందే గొబ్బెమ్మ అంటారు. గొబ్బెమ్మలు పొద్దున పూట ముగ్గులో ఉంచి, దానిపై గుమ్మడి పూలుతో అలంకారం చేస్తే చాలా అందంగా ఉంటుంది.

భోగిమం


భోగిలో వేయడానికి భోగిముళ్ళు ఈడ్చుకుని వస్తున్న దృశ్యం

మూడురోజులపాటు సాగే సంక్రాంతి పండుగలో మొదటి రోజున నాలుగు మార్గాల కూడలిలో వేయబడే పెద్ద మంట. అప్పటి నుండి ఇంతకంటే మరింత వేడితో ఉత్తరాయణ సూర్యుడు రాబోతున్నడనే సంకేతం. దక్షణాయంలో ఉండే నిద్ర బద్దకంతో సహా దగ్ధం చేయాలనే సంకేతంతో చీకటితోనే బోగిమంట వేస్తారు. ఇంట్లో ఉండే పాత కలపసామానులు, వస్తువులు, ఎండుకొమ్మలు లాంటివి బోగి మంటలో వేసి తగులబెడుతారు. వీటన్నిటినీ దారిద్ర్య చిహ్నాలుగా బావించి తగులబెట్టాలంటారు. వేసవిలో వేడికి తగులబడే వాటిని గుర్తించాలనే మరొక సంకేతం కూడా ఇందులో దాగిఉంది.

భోగిపళ్ళు


భోగి పండ్లు అంటే రేగుపండ్లు. ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన పండుగ. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపండ్లతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. సూర్య భగవానుని అనుగ్రహం పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలనే సంకేతంతో బోగిపండ్లు పోస్తారు.

తిల తర్పణం


సంవత్సరంలో మిగిలిన రోజులలో నల్ల నువ్వులు వాడరు. కాని సంక్రాంతి పర్వధినాన మాత్రం నల్లనువ్వులతో మరణించిన పిత్రుదేవతలందరికీ తర్పణములివ్వడం ఎక్కువగా చేస్తుంటారు. దీన్నే పెద్దలకు పెట్టుకోవడం అంటుంటారు. సంక్రాంతి పర్వధినాలలో వారి వారి ఆచార సంప్రదాయాలను అనుసరించి ఈ కార్యక్రమము చేస్తుంటారు. ఈ రోజు బూడిద గుమ్మడి కాయ దానము ఇస్తారు.

సంకురుమయ / సంక్రాంతి పురుషుడు


మట్టితో ఒక బొమ్మను (సంక్రాంతి పురుషుడు), తన వాహనాన్ని (ప్రతి సంవత్సరం వేరు వేరు వాహనాల పై పురుషుడు వస్తాడు. ఏ వాహనాన్ని ఎక్కితే ఆ వాహనానికి ఆ సంవత్సరం ఎక్కువ నష్టము అని ఒక నమ్మకం), మేళ తారళాలను చేసి, సంక్రాంతి మూడు రోజుల్లో పూజలు చేస్తారు. నాల్గవ నాడు ఈ బొమ్మలను వాల్లాడిస్తారు.

హరిదాసు


గొబ్బిళ్ళతో ఇంటి ముందరి భాగాన్ని అలంకరించి హరిని కీర్తించే భక్తులకు సాక్షాత్ శ్రీకృస్ణుడే హరిదాసు రూపంలో వస్తాడని సంకేతం. ఆయన తలమీద మంచి గుమ్మడి కాయా ఆకారంలో గల పాత్ర గుండ్రముగా ఉండే భూమికి సంకేతం దాన్ని తలమీద పెట్టుకొని ఉండటం శ్రీ హరి అయిన తానే భూమిని ఉద్దరిస్తున్నానని { ఉత్+దరించు= తలమీద పెట్టుకోవడం} అని చెప్పే దానికి సంకేతం. హరినామ కీర్తన చేస్తూ రావడం తను ఏ భోగాలకూ లొంగను కేవలం హరినామ సంకీర్తనకే వచ్చే వాడిననీ తనకు తమపర భేదాలు లేవనీ అందుకే ప్రతి ఇంటికీ తిరుగుతూ వస్తాడనే సంకేతం.

గంగిరెద్దు


ముందు వెనుకల చెరో ప్రమదునితో {శివ గణం} ఎత్తైన మూపురం శివలింగాకృతిని గుర్తుచేస్తూ శివునితో సహా తను సంక్రాంతి సంభరాలకు హాజరయ్యానని చెప్పే సంకేతం గంగిరెద్దు. ఆవు లేదా ఎద్దు ఇంటి ముందు ముగ్గులో నిలిచిందంటే ఆనేల ధర్మభద్దమైనదని అర్ధం. "జుగోప గోరూప ధరామివోర్విం" దీని అర్ధం ఆ నేల ఆవుకి సంకేతం ఆనేలనుండి వచ్చిన పంటకు సంకేతం ముంగిట నిలిచిన వృషభం. మీరు చేసే దానమంతా ధర్మభద్దమేనంటూ దానిని మేము ఆమోదిస్తున్నామని ఇంటింటికీ తిరుగుతుంటారు వృషభసహిత శంకర పరివారం.

గాలిపటాలు


సంక్రంతి పండుగ పిల్లలందరికి చాలా ప్రథ్యెకమైన పండుగ, అది ఎంధు వలననగ పిల్లలు అరొజు పొద్దిన నుండి సాయంత్రం వరకు గాలిపటాలతొనే గడుపుతారు.

Blogging ?

 Blogging is the act of creating and publishing content on the internet, usually in the form of a written article or post. Bloggers may write about a wide range of topics, from personal experiences and interests to news and current events. Blogging can be a hobby or a profession, and many bloggers use their blogs as a platform to share their thoughts, ideas, and opinions with a larger audience. Some bloggers also use their blogs as a way to generate income by including ads, sponsored content, or affiliate links in their posts. Blogging can be a rewarding and enjoyable activity, as it allows people to connect with others who share similar interests and to express themselves creatively.

how to create blog ?

Here are some steps you can follow to create a blog:

  1. Choose a blogging platform: There are many different platforms that you can use to create a blog, such as WordPress, Blogger, and Squarespace. Each platform has its own set of features and tools, so you should choose the one that best fits your needs.

  2. Select a domain name: Your domain name is the web address that people will use to access your blog. Choose a domain name that is easy to remember and relevant to your content.

  3. Set up hosting: Your blog will need to be hosted on a server in order for it to be accessible on the internet. You can either choose to host your blog on a paid service or on a free platform like Blogger.

  4. Design your blog: Once you have chosen a platform and set up hosting, you can start customizing the design and layout of your blog. This may include choosing a theme, adding widgets and plugins, and creating pages and menus.

  5. Start publishing content: Now that your blog is set up, you can start creating and publishing content. This may include text, images, videos, and other types of media.

  6. Promote your blog: Once you start publishing content, you should promote your blog to attract readers and followers. You can do this through social media, search engine optimization, and other marketing tactics.

     how to use blog ?

    There are many different ways to use a blog, depending on your goals and interests. Here are a few common ways that people use blogs:

    1. Sharing personal experiences: Many people use blogs as a way to document and share their personal experiences and thoughts with others. This could include topics like travel, parenting, cooking, or personal growth.

    2. Providing news and information: Blogs can also be used to share news and information on a particular topic or industry. This could include topics like current events, politics, technology, or health.

    3. Showcasing creative work: Blogs can be a great platform for artists, writers, and other creatives to showcase their work and connect with an audience.

    4. Building a community: Many bloggers use their blogs to build a community of like-minded individuals who share similar interests and engage in discussions through comments and social media.

    5. Generating income: Some bloggers use their blogs as a way to generate income through advertising, sponsored content, or selling products or services.

    Regardless of the purpose of your blog, the most important thing is to consistently create and publish high-quality content that resonates with your audience.

backlinks in seo ?

 Backlinks are links from other websites to your website. They are an important factor in search engine optimization (SEO) because they can improve the visibility and ranking of your website in search engine results pages (SERPs). When a website links to your website, it is considered a "vote of confidence" and can help to increase the credibility and authority of your website. In general, the more high-quality backlinks a website has, the more likely it is to rank well in search engine results. However, it's important to note that the quality of the backlinks is more important than the quantity, as search engines may penalize websites that engage in manipulative link building practices.

What Is an MLM? How Multilevel Marketing Works

What Is Multilevel Marketing (MLM)?

 

The term marketing (MLM) refers to a strategy used by some direct sales companies to sell products and services. MLM encourages existing members to promote and sell their offerings to other individuals and bring on new recruits into the business. Distributors are paid a percentage of their recruits' sales. New recruits become the distributor's network or downline and are, in turn, encouraged to make sales to earn money.

 

Many MLM schemes are legal, but there are also illegal operations that are run as pyramid schemes. This has cast some negative light on legitimate MLM businesses.

 

Understanding Multilevel Marketing (MLM)

 

Multilevel marketing is a legitimate business strategy that is commonly used by businesses that rely (heavily) on sales to generate revenue. Unlike traditional sales channels, multilevel marketing programs involve the use of networks for sales and to recruit new participants. As such, they're often referred to as network marketing.

 

Participants are also encouraged to bring in or recruit others into the program as participants. While they may not be pressured to do so, signing up new contractors provides a financial incentive for participants, who receive a percentage of the sales of their recruits. and their recruits, and of their recruits, and so on.1

There can be hundreds—even thousands—of participants, depending on the size of a company. Members at all levels receive some form of commission, as long as the chain keeps going. The more layers there are, the more money people can make. Think of it as a pyramid. The person or people at the top earn the most while those who sit toward the bottom earn fewer commission dollars. Relatively few, though, generally earn any meaningful income from their efforts.2

 

Is MLM Right For You?

Because multilevel marketing plans are commission-based, the participants do not receive salaries. That means that MLM businesses are often best-suited for people with an entrepreneurial spirit, who can set their own goals and schedules, who are good at sales, and who can effectively network with others not only to sell products but to recruit new marketers.

Special Considerations

 

Although it is legal, multilevel marketing is often controversial. One problem is pyramid schemes that use money from new recruits to pay people at the top rather than those who perform the work. These schemes (and the people behind them) take advantage of others by pretending to be engaged in legitimate multilevel or network marketing. You can spot pyramid schemes by their greater focus on recruitment than on product sales.1

 

An issue in determining the legitimacy of a multilevel marketing company is whether it sells its products primarily to consumers or to its members who must recruit new members to buy their products. If it is the former, the company is likely a legitimate multilevel marketer. If it is the latter, it could be an illegal pyramid scheme.2

 

Relatively few earn meaningful incomes from their efforts. To some observers, this reflects the characteristics of a pyramid scheme. That's why the Federal Trade Commission (FTC) has been investigating multilevel marketing companies for several decades.

Real-World Examples of Multilevel Marketing

 

There are a lot of examples of multilevel marketing in the corporate world. The following are just two of the most popular and well-known companies that operate in this sphere.

Amway

 

Amway is a well-known direct sales company that uses MLM to generate revenue. The company, which sells health, beauty, and home care products in more than 100 countries, reported $8.9 billion in sales conducted by its independent business owners in 2021.3 This makes it the largest MLM business in the world, by revenue.4

Herbalife Nutrition

 

Herbalife Nutrition is a high-profile MLM company that manufactures and distributes weight-loss and nutritional products. The company argues that most of its revenue is from product sales—not recruitment. It also says it offers members many protections, such as a money-back guarantee, so they will not be stuck with products they could not sell.

 

There have been multiple lawsuits against Herbalife accusing it of misrepresenting its sales practices, including a settlement reached with the FTC in 2016, under which it had to restructure its business.5

 

Activist investor William Ackman also shed a national spotlight on the company by shorting $1 billion of the company’s stock in 2012. Ackman accused the company of operating a pyramid scheme, backing up his allegations with a bet that the stock price would fall under the weight of the scam. He gave up on that bet in 2018.6 The stock rose dramatically from that point through 2021, however it has since fallen to recent lows in 2022.

What Is MLM, and Is it Legal?

 

Broadly speaking, multilevel marketing is a sales structure where members of a company are encouraged to recruit new members. Once recruited, this salesperson receives a cut of their recruiter's sales. At the same time, each salesperson profits from the sale of a given product. MLMs are often legal, legitimate businesses whose distributors earn money from the sale of actual products and from commissions on products sold by distributors that they recruit.

Is Multilevel Marketing a Pyramid Scheme?

 

Multilevel marketing is controversial and often compared to pyramid schemes. While some multilevel marketing operations are legal, others have come under investigation. This typically occurs when the majority of the operation’s profits funnel up to the top, leaving little for the rest of its members.

 

When an organization focuses primarily on recruitment, rather than selling products, this may also signal that it is operating under a pyramid scheme. Sometimes, members of these schemes will number in the hundreds or even thousands. 

What Are Some Red Flags to Look Out for an Illegal MLM Pyramid Scheme?

 

The Federal Trade Commission (FTC) warns people to take note of, and avoid, MLM promoters who:7

 

    Make extraordinary claims of enormous earning potential

    Try to persuade people that recruiting others is where the real money lies

    Pressure people to get involved without learning more about the company

    Make it clear that an opportunity will be lost unless people get in immediately

 

Another warning sign is seeing existing distributors who continue to buy products that they can never sell so that they can qualify for some kind of reward.

What Is an Example of Multilevel Marketing?

 

Avon is an example of multilevel marketing. The company operates under a model where sales are driven through a network of salespeople, through presentations, or one-on-one settings in homes or businesses. Like a number of other multilevel marketing businesses, Avon typically does not operate a fixed retail location. The parent company, instead, provides the tools and resources to entrepreneurs to conduct their business at various locations. This type of business model is also referred to as a direct sales model.

 

Other examples of MLM businesses include Tupperware, Rodan + Fields, Natura & Co., Vorwerk, Nu Skin, and PM International, among many others.4

Sponsored

Open A Trading Account in Under 5 Minutes

Open a trading account in under 5 minutes and join 900,000 others globally trading long or short on global indices, and access 1000+ other CFD products over assets like shares CFDs, forex, gold, and commodities with an award-winning broker. Trade from low spreads, and access free education and trading tools with 24/5 trading support. Learn more about trading with Vantage and