గుత్తి (Gooty),

గుత్తి (Gooty), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాకు చెందిన ఒక పట్టణము మరియు అదే పేరుగల మండలము. అనంతపురం నుండి 52 కిలోమీటర్ల దూరములో ఉన్నది.







చరిత్ర

గుత్తి ఆంధ్ర ప్రదేశ్‌లోని అత్యంత పూరాతనమైన కోటదుర్గములలో ఒకటి. గుత్తి కోట చాళుక్యుల కాలములో కట్టబడినదని భావిస్తారు అయితే విజయనగర రాజులు దీనిని పటిష్టము చేసినారు. గుత్తి కోటను ప్రస్తావించిన తొలి శాసనాలు కన్నడము మరియు సంస్కృతములో ఉన్నవి. అవి 7వ శతాబ్దము నాటివని అంచనా. ఒక శాసనములో ఈ కోట పేరు గధగా ఇవ్వబడినది. విజయనగర చక్రవర్తి బుక్క రాయల శాసనములో గుత్తి కోట దుర్గ రాజముగా కీర్తించబడినది.
గుత్తి కైఫియత్ ప్రకారము కోటను మీర్ జుమ్లా ఆక్రమించుకొనెను. ఆ తరువత ఇది కుతుబ్ షాహీ వంశస్థుల పాలనలో ఉన్నది. 1746 లో మురారి రావు ఆధ్వర్యములో మరాఠులు దీనిని జయించారు.1775 లో హైదర్ అలీ గుత్తి కోటను తొమ్మిది నెలల నిర్భంధము తర్వాత వశపరచుకొనెను. 1779 లో టిప్పూసుల్తాన్ మరణానంతరము జెరువార్ ఖాన్ అనే ముస్లింగా మారిన బ్రాహ్మణ సేనాని ఆధీనములో ఈ కోట ఉండగా నిజాము తరఫున బ్రిటిషు కల్నల్ బౌజర్ కోటను ఆక్రమించుకొని బ్రిటిషు వారి పాలనలోకి తెచ్చాడు.
కోట గుత్తి చుట్టూ ఉన్న మైదానము కంటే దాదాపు 300 మీటర్ల ఎత్తున ఉన్నది. ఈ కోట నత్తగుల్ల/శంఖము/గవ్వ (షెల్ల్) ఆకారములో నిర్మించబడి 15 బురుజులతో, 15 ముఖద్వారములు కలిగి ఉన్నది. ఇందులో రెండు శాసనములు, వ్యాయామశాల మరియు మురారి రావు గద్దె కలవు. మురారి రావు గద్దె నుండి మొత్తం గుత్తి ఊరంతా చక్కగా కనిపిస్తుంది. కోటలో చాలా నూతులున్నవి.

No comments:

Post a Comment