రాయ వేలూరు కోటలోని జలకంఠేశ్వరాలయం


రాయ వేలూరు కోటలోని జలకంఠేశ్వరాలయం


రాయ వేలూరు కోటలో వున్న జలకంటేశ్వరాలయం అతి పురాతనమైనది మరియు అందమైనది. అంతకన్న ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఈ ఆలయ ఆవరణంలో వున్న కళ్యాణ మండపం. చూపరులను మంత్ర ముగ్దులను చేయగల విన్యాసము విజయనగర శిల్ప కళలో వున్నది. దక్షిణ భారత దేశంలో విజయ నగర శిల్ప కళ లేని ఆలయం లేదు. ఫలాన గుడిని ఎవరు కట్టించారన గానె వెంటనె వచ్చె సమాధానం శ్రీ క్రిష్ణ దేవరాయలు. అని. వారు కట్టిన అలయాలు అంత విస్త్రుతంగా వున్నాయి. వాటిలోని శిల్ప కళ కూడ అంత విశిస్టంగా వుంటుంది. ఆ ఆలయాలలోని కళ్యాణ మంట పాలలోని శిల్ప కళ మరీ అద్బుతంగా వుంటుంది. అలాంటి కళ్యాణ మండపాలలో ముఖ్యంగా,, ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అవి, హంపి లోని విఠలాలయంలో కళ్యాణ మండపం, మధురై లోని వేయి స్థంబాల మండపం,తిరునల్వెలి లోని మండపం., కోయంబత్తూరు దగ్గర వున్న పేరూరు మండపం., రాయ వెల్లూరు లోని జలకంఠేశ్వరాలయంలోని కళ్యాణ మండపం.


ఇవి దక్షిణ భారత దేశంలోనె అత్యంత అందమైన మండపాలు. వీటిలో జలకంటేశ్వరాలయంలోని కళ్యాణ మండపం చిన్నదైనా శిల్ప కళా కౌశలం రీత్యా చాల అద్బుతమైనది.ఇది విజయనగరాదీసుడు సదాశివ రాయల కాలంలో కట్ట బడినదిగా చారిత్రిక ఆదారాలున్నాయి. ప్రధాన ఆలయం రాయ వేలూరు కోటలోనె వున్నందున, కాల గమనంలో కోటతో బాటు ఈ ఆలయం కూడ బ్రిటిష్ వారి అధీనంలోకి వచ్చింది. ఈకళ్యాణ మండపంలోని శిల్ప కళా రీతులకు ముగ్దులైన బ్రిటిష్ వారు దానిని ఏకీలుకు ఆకీలు జాగ్రత్త గా విడదీసి సముద్రాలు దాటించి లండన్ లో తిరిగి పున:ప్రతిష్టించాలని బావించారు. దానికి తగిన ఏర్పాట్లన్ని చేసు కున్నారు. దీని కొరకు లండన్ నుండి ఒక స్టీమరు కూడ బయలు దేరింది. కాని వారి దురదృష్టమో, భారతీయుల అదృష్టమో గాని ఆ స్టీమరు మార్గ మద్యలొ మునిగి పోయింది. ఆ సందర్బంలోనె జరిగిని అనేక రాజకీయ కారణాల వల్ల కళ్యాణ మండపాన్ని తరలించే కార్యక్రమం మూలన పడింది. ఆ విధంగా ఆ శిల్ప కళా కౌశల్యాన్ని మనమీనాడు చూడ గలుగు తున్నాము. ఈ కళ్యాణ మండపం ఆలయ ప్రధాన గోపురానికి పక్కనె ఒక మూలన వున్నది. ఇది మూడు భాగాలుగా వున్నది. ఇందులో అన్ని కలిపి నలబై ఆరు శిల్ప కళా శోభితమైన స్థంబాలున్నాయి. ముందు భాగంలో చుట్టు ప్రహరి గోడ లేదు. ఇందులోనె మద్యన పైకప్పుకు వున్న శిల్ప కళను బొమ్మలో చూడ వచ్చును. రెండొ భాగం మొదటి దానికన్నా మూడడుగుల ఎత్తున వున్నది. ఏ కారణం చేతనో దీని లోనికి వెళ్లడానికి మెట్లు నిర్మించ లేదు. దీని తర్వాత నున్న మోడో భాగం ఇంకొంచెం ఎత్తుగా వున్నది. ఈ రెండు భాగాలకు మాత్రం చుట్టు గోడ వున్నది. మద్యలో కూర్మం (తాబేలు) శిల్పం చెక్కి వున్నది.ఇది మద్యలో చిన్న వేధికలాగ కనబడుతుంది. స్థంబాలపై అష్ట దిక్పాలకుల చిత్రాలు, వినాయకుడు, విష్ణు, బ్రంహ, భూదేవి,శ్రీ దేవి,సరస్వతి, పార్వతి మొదలగు దేవతా మూర్తుల చిత్రాలు అత్యంత అందంగా చిత్రించి వున్నాయి. ఇవి గాక నాట్య గత్తెల, సంగీత కారుల, శిల్పాలు కూడ వున్నాయి. ప్రతి స్థంబం మీద శిల్ప కళను వివరంగా గమనిస్తే అనేక పురాణ గాధలను స్పురింప జేస్తాయి. ఇందులోని ఒక శిల్పం గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అది ఒక ఎద్దు, ఒక ఏనుగు ఎదురెదురుగా నిలబడి వున్నట్టుంది. కాని ఆ రెండింటికి తల ఒక్కటే. ఎద్దు శరీరాన్ని మూసి చూస్తె ఏనుగు కనిపిస్తుంది. అలాగె ఏనుగు శరీరాన్ని మూసి చూస్తే ఎద్దు ఆకారం కనబడుతుంది. ఇలాం చిత్రం హంపి లోని అచ్యుత రామాలయంలోను, హజరా రామాలయంలోను, దశరా దిబ్బ ప్రక్కన మైదానంలోను వున్నాయి. ఇదొక శిల్ప కళా వైచిత్రి.

జలకంటేశ్వరాలయం లోని ప్రధాన గోపురం, ఆలయం లోపలినుండి తీసిన చిత్రం, రాయవెల్లూరు లోని జలకంటేశ్వరాలయం.

కళ్యాణ మండపం లోని శిల్ప కళా శోభితమైన స్థంబాలు. జలకంటేశ్వరాలయం, రాయ వెల్లూరు లో తీసిన చిత్రం


కళ్యాణ మండపం ముందు బాగం లోని పైకప్పుకున్న శిల్పకళా చాతుర్యం,రాయవెల్లూరు కోట లోని జలకంటేశ్వరాలయంలో తీసిన చిత్రం
జల కంటేశ్వరాలయం: రాయ వెల్లూరు: రాయ వెల్లూరు కోట లోనె వున్న జల కంటేశ్వరాలయము, కోటతో బాటు పదహారవ శతాబ్దంలో విజయనగర సాంరాజ్యాధినేత సదా శివ రాయల కాలంలో కట్ట బడినది. విజయ నగర పతనానంతరము ఈ కోట, అందులో భాగమైన ఈ ఆలయము ముస్లింల పాలకులైన ఆర్కాడు నవాబుల పాలన లోనికి వెళ్లింది. అలా చాలకాల మున్నది. ఆ సమయంలో ఈ ఆలయం లోని దేవతా మూర్తులను, శివ లింగాలను ద్వంసం చేయడమో, లేదా పెకలించి కోట అగడ్తలో పడవేయడమో జరిగింది. వాటిని అగడ్తలో పడవేసి వుంటారనడానికి నిదర్శనంగా అడప దడపా అగడ్తలో దొరికిన శిల్ప ఖండాలె ఆనవాలు. శతాబ్దాలు గడిచి నందున ఆ విగ్రహాలు అగడ్తలోని బురదలో కూరుక పోయి వుంటాయని భావించ బడుతున్నది. అగడ్తలో త్రవ్వకాలు జరిపితే అవి భయట పడవచ్చును. ముస్లిం పాలకుల తర్వాత ఈ కోట బ్రిటిష్ వారి వశమై అలా చాల కాలమున్నది. ఆ సందర్బంలో బ్రిటిష్ వారు కోటను వారి సైనిక కేంద్రంగా మార్చారు. ఇందులోని ఆలయ సముదాయాన్ని, వారి మందు గుండు సామాగ్రికి గోదాముగా వాడు కున్నారు. బ్రిటిష్ వారి కాలంలోనె అప్పటి కేంద్ర ప్రభుత్వం 1921 వ సంవత్సరంలో రాయ వెల్లూరు కోటను, అందులోనె వున్న మసీదును, జలకంటేశ్వరాలయాన్ని జాతీయ సంపదగా గుర్తించి దాని పరిరక్షణకు దాన్ని పురావస్తు శాఖకు అప్పగించింది. ఆ విధంగా ఈ జలకంటేశ్వరాలయం కొన్ని శాతాబ్దాల పాటు నిత్య దూప దీప నైవేద్యాలకు నోచుకోక మూసి వున్న కోట గోడల మద్య వుండి పోయింది. భారత్ కు స్వాతంత్రం వచ్చింతర్వాత, ప్రజలు, పుర ప్రముఖులు, ఆలయాన్ని తమ స్వాదీనం చేసుకోడాకి చేయని ప్రయత్నం లేదు. మతాచార్యులు అనేక ఉద్యమాలు, వత్తుడులు చేసినా ఫలితం కనబడలేదు. ఇది మత సంబందమైన సున్నిత విషయమని, శాంతి భద్రతల సమస్యలు ఏర్పడవచ్చునని భావించి భారత దేశ అద్యక్షులు గాని, భారత ప్రధాని గాని, ఇతర కేంద్ర ప్రభుత్వ పెద్దలు గాని ఈ విషయంలో ఏమి చేయ లేక పోయారు. చివరకు 1981వ సంవత్సరంలో జిల్లా కలెక్టరు వ్వక్తిగత మద్దతుతో, మైలారు గురూజి సుందర స్వామి, మరియు తంజావూరు రామనందేద్ర సరస్వతి స్వామి వారి మద్దతుతో వెల్లూరు పట్టణ ప్రముఖులు రహస్యంగా బయట ఒక గుడిలో వున్న శివ లింగాన్ని తెచ్చి జలకంటేశ్వరాలయంలో ప్రతిష్టించి పూజ కార్యక్రమాలు నిర్వ హించాలని రహస్య పథకాన్ని రచించారు. ఆ పధకంలో భాగంగా 16 మార్చి, 1981 వ సంవత్సరంలో వేరె గుడిలో వున్న శివ లింగాన్ని మూసి వుంచిన ఒక లారీలో తెచ్చి సిద్దంగా వుంచు కున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు ఉన్నట్టుండి ఒక్కసారిగా సుమారు రెండు వేలమంది పుర ప్రముఖులు అక్కడ గుమి గూడి లారి లోనుండి శివ లింగాన్ని దించి కోటలోని ఆలయంలోనికి ప్రవేసించి లింగాన్ని ప్రతిష్టించి పూజా కార్య క్రమాలు చేసేశారు. ఉన్నట్టుండి జరిగిన ఈ వ్వవహారాన్ని పోలీసులు గాని, జిభారత స్వాతంత్రానంతరము రాయ వెల్లూరు ప్రజలు, ఇతర మత పెద్దలు, ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్టకు, నిత్య దూప దీప నైవేద్యం చేయడాని చేయని ల్లా కలెక్టరు గాని అడ్డుకోలేక పోయారు. పురా వస్తు శాఖ వారు ఈ సంఘటనను పోలీసులకు, జిల్లా కలెక్టరు పిర్యాదు చేయడం తప్ప ఏమి చేయ లేక పోయారు. ఆ తర్వాత కూడ ఇది సున్నితమైన మత సంబందిత విషయమైనందున, దాంతో ఏదైన శాంతి భద్రతల సమస్యలు పుట్టుకొస్తాయనే భయంతో అధికారులు ఎవరు ఎటువంటి చర్యలకు పాల్పడలేదు. ఆ తర్వాత మతాచార్యుల మద్దతుతో ఆలయ ప్రాంగణంలో అన్ని గర్బగుడులలో విగ్రహాలను ప్రతిష్టించి శాస్త్రోక్తంగా పూజా కార్య క్రమాలు నిర్వ హించారు. ఆ విధంగా వేలూరు పుర ప్రజలు తమ అనేక ఉద్యమాల ఫలితంగా శతాబ్దాల తరబడి మూసి వున్న చీకటి కోటలో మగ్గిన ఈ చారిత్రిక జలకంటేశ్వరాలయాన్ని భక్తులకు ప్రజలకు అందుబాటు లోనికి తెచ్చారు. ఎన్నో చారిత్రిక సంఘటనలకు ఆలవాలమైన ఈ రాయ వెల్లూరు కోట, అందులోని ఈ ఆలయము నకు సంబందించిన ఈ పున: ప్రతిష్ట సంఘటన కూడ దాని చరిత్రలో ఒక భాగమై పోయింది.
మూలం: శ్రీ ఎ.కె.శేషాద్రి, రచించిన "వెల్లూరు ఫోర్టు అండ్ ది టెంపుల్ త్రూ థి ఏజెస్" అనే గ్రంధం. మరియు వ్వక్తిగత సందర్శన. ==శ్రీ రంగ క్షేత్రం== (శ్రీరంగం) నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాలలో అతి ముఖ్యమైనది. ఈ క్షేత్ర దర్శనంతో 108 క్షేత్రాల దర్శన ఫలితం వస్తుందని భక్తుల నమ్మకం.ఐదు వేల సంవత్సరాలకు ముందు కట్టిన ఈక్షేత్రం చోళుల, పాండ్యుల, హోయసలల, విజయనగర రాజుల కాలంలో విశిష్ట ప్రసిద్ది గాంచినది. ఈ ఆలయ రాజ గోపురము ఎత్తు 230 అడుగుల ఎత్తుకు పైనే వుంటుంది. ఈ ఆలయానికి పదమూడు ద్వారాలు, ఏడు ప్రాకారాలు వుండటము విశేషము.

No comments:

Post a Comment